ఉప్పల్లో నయా దందా

by Sridhar Babu |
ఉప్పల్లో నయా దందా
X

దిశ,ఉప్పల్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకారణ కార్యక్రమం చేపట్టింది. అయితే ప్రజలు రేషన్ కార్డులో మార్పులు చేర్పులు, ఆధార్ కార్డు అప్డేట్ కొత్త రేషన్ కార్డుల కోసం ఉప్పల్ లోని సివిల్ సప్లై కార్యాలయానికి ప్రజలు పెద్ద ఎత్తున క్యూలైన్లో నిల్చొని అప్లికేషన్ ఫామ్స్​ అందజేస్తున్నారు.

అయితే ఇదే ఆసరాగా తీసుకొని కొంతమంది బ్రోకర్లు కార్యాలయం వద్ద అమాయకులను ఆసరాగా చేసుకుని నయాదందాకు తెర లేపారు. అప్లికేషన్ రాస్తే 50 రూపాయలు వసూలు చేస్తున్నారు. రోజుకి వీరు వేలళ్లో సంపాదిస్తున్నారు. ఇదే అదునుగా అనేక మంది ఈ దందా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారులు స్పందించి అమాయక ప్రజలనుండి వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed