తాడ్ బంద్ హనుమాన్ ఆలయంలో ఘనంగా హనుమాన్ జయంతి

by Disha Web Desk 12 |
తాడ్ బంద్ హనుమాన్ ఆలయంలో ఘనంగా హనుమాన్ జయంతి
X

దిశ, కంటోన్మెంట్/బోయిన్‌పల్లి: హనుమాన్ జయంతి పురస్కరించుకుని సికింద్రాబాద్ బోయిన్ పల్లి లోని తాడ్ బండ్ హనుమాన్ దేవాలయాన్ని, పరిసర ప్రాంతాలను విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అయోధ్య రాముడితో పాటు వివిధ దేవతా మూర్తుల పటాలను ఎల్ఈడి కాంతులతో ఏర్పాటు చేశారు. అయోధ్య రామాలయం తో పాటు రాముడి ఫ్లెక్సీలు ప్రత్యేక ఆకర్షణతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మంగళవారం ఉదయం నుంచి ఆలయానికి 2 కిలోమీటర్ల దూరం వరకు భక్తులు క్యూ లైన్ ల‌లో బారులు తీరారు. అదేవిధంగా నగరంలో చేపట్టే శోభాయాత్ర తాఢ్ బంద్ దేవాలయం వద్దనే ముగుస్తుంది. కనుక దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేశామని ఆలయ ఈఓ అంబుజా తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పూర్తి బందోబస్తును ఏర్పాటు చేసి ప్రత్యేక నిఘా, సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించనున్నారని డీసీపీ తెలిపారు.



Next Story

Most Viewed