14 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం : ఎమ్మెల్యే

by Kalyani |
14 లక్షల వ్యయంతో  సీసీ రోడ్డు పనులు ప్రారంభం :  ఎమ్మెల్యే
X

దిశ, ఉప్పల్: చిల్కానగర్ డివిజన్ ధర్మపురి కాలనీలో 14లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు పనులను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి,చిలుకానగర్ డివిజన్ కార్పొరేటర్,జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్ బన్నాలగీతా ప్రవీణ్ ముదిరాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ… డివిజన్ లోని అన్ని కాలనీలో బస్తీల్లో ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలను అందిస్తూ దశలవారిగా ప్రణాళిక బద్ధంగా డివిజన్ ను అభివృద్ధి చేస్తున్నామని ఇందులో భాగంగా ధర్మపురికాలనీ సీసీ రోడ్డు ను ప్రారంభించడం జరిగిందన్నారు.

కార్పొరేటర్ గీతా ప్రవీణ్ ముదిరాజ్ మాట్లాడుతూ ధర్మపురి కాలనీలోని సాయిబాబా దేవాలయం అత్యంత ప్రాచుర్యం పొందిన దేవాలయం అని డివిజన్లోని ప్రజలు పెద్ద ఎత్తున దేవాలయానికి వస్తూ ఉంటారని వారందరి సౌకర్యార్థం నూతన సీసీ రోడ్డు ను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సహకారంతో చిలుకనగర్ డివిజన్ ని ఉప్పల్ నియోజకవర్గంలోనే నంబర్ వన్ డివిజన్ గా తీర్చిదిద్దుతామని అన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, సీనియర్ నాయకులు, ఉద్యమ నాయకులు, మహిళా నాయకురాలు, ధర్మపురి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.



Next Story