మల్కాజిగిరిలో మూడో రోజు 7 నామినేషన్లు

by Disha Web Desk 15 |
మల్కాజిగిరిలో మూడో రోజు 7 నామినేషన్లు
X

దిశ, మేడ్చల్ బ్యూరో : మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో నామినేషన్ల ప్రక్రియలో భాగంగా మూడవ రోజు శనివారం ఏడుగురు అభ్యర్థులు నామి నేషన్​ వేసినట్లు ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. భారతీయ జనతా పార్టీ నుండి ఈటెల రాజేందర్, ఈటెల జమున రెండో సారి నామినేషన్ల పత్రాలు దాఖలు చేశారు. ప్రజా వెలుగు పార్టీ నుండి లోగరి రమేష్, ధర్మ సమాజ్ పార్టీ నుండి బోయిన దుర్గాప్రసాద్ యాదవ్ , ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పెండ్యాల సాయి వరప్రసాద్, పెసరి కాయల పరీక్షిత్ రెడ్డి, కంటే సాయన్న నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలిపారు. మూడు రోజులలో ఇప్పటి వరకు 22 నామినేషన్లు దాఖలైనట్లు చెప్పారు.



Next Story

Most Viewed