ఉపాధ్యాయ వృత్తి ఉన్నతమైనది : రఘోత్తంరెడ్డి

by Aamani |
ఉపాధ్యాయ వృత్తి ఉన్నతమైనది : రఘోత్తంరెడ్డి
X

దిశ,పాపన్నపేట : ఉపాధ్యాయ వృత్తి ఎంతో ఉన్నతమైనదని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి కొనియాడారు. పిఆర్టియు మండల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మండల పరిధిలోని ఎల్లాపూర్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొత్తూరు రాజయ్య ఉద్యోగ విరమణ అభినందన సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయ వృత్తి మహోన్నతమైనదని, ఎందరో పేద విద్యార్థులకు సేవ చేసిన గొప్ప వ్యక్తి రాజయ్య అని, సమాజ సేవలో కూడా ముందుండే రాజయ్య జీవితం ధన్యమన్నారు. షెడ్యూల్ ప్రకారమే పదోన్నతులు, బదిలీలు జరుగుతాయని, మిగిలి పోయిన స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులు తప్పకుండా అందరికీ దక్కుతాయన్నారు.

కొద్ది రోజుల్లో బడులలో ఉచిత విద్యుత్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు సబ్బని శ్రీనివాస్, కార్యదర్శి సుంకరి కృష్ణ, మాస పత్రిక సంపాదక సభ్యులు వెంకట్ రామ్ రెడ్డి, నరసింహ చారి, కాంప్లెక్స్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రతాప్ రెడ్డి, మహేశ్వర్, శ్రీనివాస్ రావు, ఉపాధ్యాయులు పంతుల రాజు, తాళ్ల శ్రీనివాస్, విక్రమ్ గౌడ్, సురేష్ , అంజనా చారి తదితరులు పాల్గొన్నారు.



Next Story