సొసైటీ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం..

by Sumithra |
సొసైటీ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం..
X

దిశ, నిజాంపేట : దళారులను నమ్మి ప్రజలు మోసపోవద్దని సొసైటీ వైస్ చైర్మన్ వెంకట్ స్వామి గౌడ్ అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్, నగరం తండా గ్రామాలలో రామాయంపేట సొసైటీ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దన్నారు.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద మాత్రమే ధాన్యం కొనుగోలు జరపాలన్నారు. ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న వడ్లకి క్వింటాల్ కి 2,300 రూపాయలను రైతులకు చెల్లిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ సుధాకర్ రెడ్డి, గ్రామస్తులు కోమ్మడి జీవన్ రెడ్డి, మ్యదరి ప్రభాకర్, పిట్ల ఆంజనేయులు, పిట్ల రమేష్, ఊడెపు రాజయ్య, మ్యదరి స్వామి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed