- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
వరద ముంపు ప్రాంతాలకు పటాన్ చెరు ఎమ్మెల్యే కీలక హామీ
దిశ,పటాన్ చెరు : పటాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామ పరిధిలోని నాగార్జున కాలనీ, రాధమ్మ కాలనీ, పార్థసారథి కాలనీలలో వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చేపట్టబోతున్నట్లు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శనివారం ఉదయం మాజీ ప్రజాప్రతినిధులతో కలిసి కాలనీలలో పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు ఉప్పొంగి కాలనీలలో చేరి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని స్థానికులు ఎమ్మెల్యే జీఎంఆర్ దృష్టికి తీసుకెళ్లారు.
ఇందుకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే జీఎంఆర్.. జాతి ముత్తంగి పరిధిలోని జాతీయ రహదారి మీదుగా కాలనీల నుంచి బాక్స్ డ్రైనేజీ నిర్మించి వరద నీటికి శాశ్వత పరిష్కారం చూపెడతామని తెలిపారు. వచ్చే వర్షాకాలంలోపు పనులు పూర్తయ్యేలా చూస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, మాజీ ఉప సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, సీనియర్ నాయకులు నరేందర్ రెడ్డి, ఆంజనేయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.