గడీల పాలన కాదు.. కాంగ్రెస్ పాలన చూడండి...

by Disha Web Desk 15 |
గడీల పాలన కాదు.. కాంగ్రెస్ పాలన చూడండి...
X

దిశ, ములుగు : గజ్వేల్ నియోజకవర్గం వర్గల్ మండలంలో మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు నిర్వహించిన ఎన్నికల ప్రచారం దుమ్ము రేపింది. ములుగు నుంచి వర్గల్ మండలానికి చేరుకున్న ఎంపీ అభ్యర్థి నీలం మధు ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. మంగళవారం ములుగు మండల కేంద్రంలోని పలు సెంటర్ల మీదుగా బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రచారంలో భాగంగా వర్గల్ కార్నర్ మీటింగ్ లో ఎంపీ అభ్యర్థి నీలం మధు మాట్లాడుతూ గతంలో గడిల పాలనను చూశారు.

ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలనను చూడండి అని అన్నారు. గత పాలనలో స్వేచ్ఛ లేకుండా పోయిందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజా పాలన కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ దేశంలో పేదల కోసం ఆలోచించేది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. పేదల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా నిలబడుతుందన్నారు. గత బీఆర్​ఎస్ ప్రభుత్వం ఈ పదేళ్లలో కనీసం పేదలకు మూడు ఎకరాల భూములు, రేషన్ కార్డులైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు. బీజేపీ అదాని, అంబానీల కోసం పనిచేస్తుందని విమర్శించారు. దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రాగానే యువతకు లక్షలాది ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని చెప్పారు. తనను ఎంపీ అభ్యర్థిగా గెలిపిస్తే మెదక్ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

నీలం మధును భారీ మెజార్టీతో గెలిపించాలి : తూముకుంట నర్సారెడ్డి

బీసీ సామాజిక వర్గానికి చెందిన యువనేత మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధును భారీ మెజారిటీతో గెలిపించాలని సిద్దిపేట జిల్లా ఇన్చార్జి తూముకుంట నర్సారెడ్డి అన్నారు. కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. కార్యకర్తల బాగు కోసం పనిచేస్తానని చెప్పారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో నీలం మధు గెలుపు కోసం కార్యకర్తలంతా శ్రమించాలని సూచించారు.

ఈ పార్లమెంట్ ఎన్నికలలో కష్టపడిన కార్యకర్తలకు భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ప్రజలకు అభివందనం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యాలని అభ్యర్థించారు. ఎలక్షన్ ఇంచార్జ్ సురేందర్ ముదిరాజ్, ఆంక్ష, రాజశేఖర్ రెడ్డి, ఎలక్షన్ రెడ్డి, భూమి రెడ్డి, ములుగు మండలం కాంగ్రెస్ అధ్యక్షులు తమ్మల శ్రీనివాస్, కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా, మహ్మద్ సలీం, కరుణాకర్, ప్రభు, ప్రదీప్, సందీప్, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed