అంజన్న ఆలయంలో నీలం మధు ప్రత్యేక పూజలు

by Disha Web Desk 15 |
అంజన్న ఆలయంలో నీలం మధు ప్రత్యేక పూజలు
X

దిశ, నర్సాపూర్ : జిల్లాలోని శివంపేటలో విశిష్టత గాంచిన శ్రీ చాకరిమెట్ల సహకార అంజన్నస్వామి వారిని మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ మంగళవారం దర్శించుకున్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని మెదక్ డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డితో కలిసి సందర్శించారు.

ఈ సందర్భంగా ఆలయంలో నీలం మధు ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయంలో పూజలు చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుహాసిని రెడ్డి , ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి, సీనియర్ నాయకులు రవీందర్ రెడ్డి, లక్ష్మీపతిరావు, శ్రీనివాస్ గుప్తా, మాజీ ఎంపీపీ లలిత, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ హంసి బాయ్ నాయకులు వెంకట్రాంరెడ్డి పాల్గొన్నారు.



Next Story

Most Viewed