- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
వడదెబ్బతో వ్యక్తి మృతి
దిశ, కొల్చారం: ఎండ వేడిమి తాళలేక వడదెబ్బతో వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం మండల కేంద్రమైన కొల్చారంలో చోటుచేసుకుంది. మృతుని కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాల ఇలా ఉన్నాయి. కొల్చారం గ్రామానికి చెందిన కుమ్మరి శాఖయ్య (ఏడుకొండలు) మామిడి కాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. కాగా గత రెండు మూడు రోజులుగా మామిడి చెట్లు గుత్తకు తీసుకుందామని ఎండలో పలు గ్రామాలు తిరిగాడు. రోజువారీ లాగే గురువారం కూడా మండలంలోని
రంగంపేట, కోనాపూర్ వైపు వెళ్లి తిరిగి వస్తుండగా బాగా దాహం వేసి రంగంపేట లోని ఒక శీతల పానియాలు అమ్మే బండి దగ్గర ఆగి ఒక గ్లాసు నిమ్మరసం అడిగి తాగిన వెంటనే నీరసపడిపోయాడు. శాఖయ్య వెంట ఉన్నవారు వెంటనే గమనించి ఆసుపత్రికి తరలించినా పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మరణించాడు. మృతుని కుమారుడు వీరేష్ ఫిర్యాదు మేరకు కొల్చారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.