- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
జాకీలు పెట్టి లేపినా కాంగ్రెస్ పార్టీ లేచే పరిస్థితి లేదు : ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు

దిశ, గజ్వేల్ రూరల్ : రేవంత్ పాలనపట్ల ప్రజలు విసిగిపోయారని ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టిస్తుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. గజ్వేల్ పట్టణంలోని శోభా గార్డెన్ లో మెదక్ ఎమ్మెల్సీ డాక్టర్ వంటేరు యాదవ రెడ్డి, గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ ప్రతాప్ రెడ్డితో కలిసి ఈనెల 27న వరంగల్ లో జరిగే బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ ఆదివారం బీఆర్ఎస్ నాయకులతో కలిసి మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎంత స్పీడ్ గా కాంగ్రెస్ పార్టీ గెలిచిందో అంతే స్పీడ్ గా గ్రౌండ్లో కుప్పకూలిందని అన్నారు. రేవంత్ రెడ్డి వచ్చాక ఆస్తులు అమ్ముదామన్న, కుదవ పెడదామన్నా వీలు లేకుండా పోయిందని గ్రామాల్లో ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని అన్నారు. వ్యాపారాలు పూర్తిగా నడవడం లేదని ఏ వ్యాపారిని అడిగినా వ్యాపారం లేదు అంటున్నారని అన్నారు.
అదే విధంగా రైతు రుణమాఫీ పూర్తిస్థాయిలో చేయలేదని ఒక మండలంలో చూస్తే 5100 మందికి రుణమాఫీ అయితే 7300 మందికి రుణ మాఫీ కాలేదని తేలిందని, దీని మీద అసెంబ్లీలో నిలదీసిన విషయం మీకు తెలుసన్నారు. గజ్వేల్ లో ప్రతి కులానికి ఏదో విధంగా బీఆర్ఎస్ పాలనలో న్యాయం చేసామని కుల సంఘాల వారికి కమ్యూనిటీ బిల్డింగ్లు, గుళ్ళూ, ఇలా ఎన్నో చేశామని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో ఇండ్లు, షాపులు కిరాయికి దొరికేవి కావని ఇప్పుడు ఎక్కడ చూసినా టూ లెట్ బోర్డులు కనపడుతున్నాయని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పోయాక గజ్వేల్ మళ్ళీ వెనుకబడిన విషయం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. దేవుడి పై ఒట్టు పెట్టి దేవుణ్ణే మోసం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని అటు అసెంబ్లీలో ఇటు బయట ఎక్కడైనా అబద్ధాలు చెప్తాడని అన్నారు. యంగ్ ఇండియా స్కూల్ బ్రాండ్ అని రేవంత్ అన్నాడు. ఇచ్చిన హామీలు ఎగ్గొట్టుడు, అబద్ధాలు చెప్పడం, చెట్లు నరకుడు, బూతులు మాట్లాడుడు ఇవి రేవంత్ రెడ్డి బ్రాండ్లు అని మిషన్ భగీరథ, కళ్యాణ లక్ష్మీ, రైతుబందు, రైతు భీమా వంటి అనేక పథకాలు కేసీఆర్ బ్రాండ్లు అని అన్నారు. చెట్లు పెట్టుడు కేసీఆర్ వంతు అయితే చెట్లు నరకుడు రేవంత్ రెడ్డి వంతు అని అన్నారు.
ఎకరాలకు ఎకరాలు చెట్లు నరికేస్తున్నాడని రూ.170 కోట్ల లంచం ఇచ్చి అప్పులు తెచ్చింది రేవంత్ రెడ్డి అని అన్నారు. హెచ్ సీయూలో 400 ఎకరాల భూమి కుదపెట్టి రూ.10 వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారని, సమాచార హక్కు చట్టం ప్రకారం అప్లికేషన్ పెట్టానని కానీ రేవంత్ రెడ్డి వల్ల అధికారులు బలి అయ్యే పరిస్థితి వచ్చిందని అన్నారు. జాకీలు పెట్టి లేపినా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లేచే పరిస్థితి లేదని అన్నారు. గ్రామాల్లో సన్నబియ్యం ఇస్తున్నారని, అందులో 40 శాతం నూకలే అని సహపంక్తి భోజనం పేరిట ఇంటి నుండి క్యారెజ్ తీసుకొని బిల్డఫ్ ఇస్తూ ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారని మండిపడ్డారు. నూకలు లేకుండా గురుకులాలకు కేసీఆర్ ఏ విధంగా సన్నబియ్యం ఇచ్చారో దమ్ముంటే అదే విధంగా ఇవ్వండి అని అన్నారు. వడ్లు కొనమని అడిగితే నూకలు బుక్కండి అన్నది బీజేపీ ప్రభుత్వం అయితే నూకలు ఉన్న బియ్యం ప్రజలకు ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలిపారు. రూ.14 వేల కోట్ల రూపాయల రైతు బంధు ఎగ్గొట్టి అసంపూర్తిగా రుణ మాఫీ చేసిండని అవే పైసలు అని అది కూడా పూర్తిగా చేయని అసమర్థ ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం అని విమర్శించారు.
కేసీఆర్ ప్రభుత్వంలో కరోనా కాలంలో కూడా రైతు బంధు ఇచ్చాడని కాంట్రాక్టర్లకు బిల్లు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం అని గుర్తుచేశారు. నేడు కాంట్రాక్టర్లను ఇబ్బంది పెడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని 20% కమిషన్ కొట్టు బిల్లు కొడతాం అని అంటుంది మీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. సెక్రటేరియట్ లో కాంట్రాక్టర్ ధర్నా చేస్తున్నారని ఇటువంటి ప్రభుత్వం ఎప్పుడు చూడలేదని మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్వయంగా మా ప్రభుత్వం పని ఐపోయినట్టే అని మాతో అంటున్నారని అన్నారు. మళ్ళీ గెలిచేది లేదు అని వారే అంటున్నారని అన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు లాభం అవుతుందని కష్టపడి పనిచేస్తే మీ అందరికీ అవకాశాలు వస్తాయని మీ అందరికీ నా సంపూర్ణ మద్దతు సహకారం ఉంటుందని అన్నారు. పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో పెద్ద సభలు పెట్టలేదని బీఆర్ఎస్ పార్టీ అవతరించి 25 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ లో భారీ బహిరంగ సభను నిర్వహించాలని అనుకున్నారన్నారు. ఎలెక్షన్ లలో తప్ప ఇప్పుడు పెట్టే ఈ మీటింగ్ ప్రతిష్టాత్మకం అయినదని అన్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి కార్యకర్తలు స్వచ్ఛందంగా వస్తామని అంటున్నారని అన్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లా నుండి లక్ష మంది హాజరు కావాలని కేసీఆర్ మనకు టార్గెట్ ఇచ్చారని అన్నారు. నాయకులు సమావేశానికి కార్లలో కాకుండా కార్యకర్తలతో బస్సులో రావాలని ప్రతి ఒక్కరు కష్టపడి మీటింగ్ సక్సెస్ అయ్యే వరకు ఉండాలని సూచించారు. సభకు వచ్చిన కార్యకర్తలను నాయకులు ఇంటికి చేర్చే వరకు జాగ్రత్త తీసుకోవాలని అందరం ఇందుకోసం శ్రమించాలని చెప్పారు. మహిళా నాయకులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని అక్కడ మీటింగ్ జరిగే ప్రాంతంలో మహిళలకు ప్రత్యేక గ్యాలరీ పది వేల మంది కూర్చునేలా ఏర్పాటు చేశారని అన్నారు. వచ్చిన ప్రతి కార్యకర్త సభకు హాజరు కావాల్సిందేనని కేసీఆర్ ప్రసంగం ఐపోయే వరకు క్రమశిక్షణతో ఉండాలని సూచించారు. నాయకులు మండలాల వారిగా సమావేశం ఏర్పాటు చేసుకోవాలని నాయకులు పనిచేస్తే లోకల్ బాడీ ఎన్నికల్లో మనమే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. గజ్వేల్ నియోజకవర్గంలో రెండు మున్సిపాలిటీలు మనమే గెలుస్తామని అన్నారు. కష్టపడ్డ కార్యకర్తలను గెలిపించుకుందామని భవిష్యత్తు మీదే అని అన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.