బీజేపీలో పలువురి చేరిక

by Disha Web Desk 15 |
బీజేపీలో పలువురి చేరిక
X

దిశ, కొమురవెల్లి : బీజేపీలో పలువురు చేరారు. అలాగే భారతీయ జనతా పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ మంగళవారం నామినేషన్ వేస్తున్న సందర్బంగా ర్యాలీలో పాల్గొనుటకు కొమురవెల్లి మండల బీజేపీ శ్రేణులు భువనగిరికి తరలి వెళ్లారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు అకర్షితులైన కొమురవెల్లి మండలం గురవున్నపేట గ్రామానికి చెందిన

పలువురు ఇతర పార్టీ నాయకులు కొమురవెల్లి బీజేపీ మండలాధ్యక్షుడు బూర్గోజు నాగరాజు, జనగామ అసెంబ్లీ కో కన్వీనర్ దండ్యాల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గుర్రాల రాములు, దండ్యాల భిక్షపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎక్కలదేవి మధు, ఉపాధ్యక్షులు వంగ శివారెడ్డి, బ్రాహ్మణపల్లి బాబు, మద్దికుంట్ల కరుణాకర్, ఈగ కనకయ్య తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed