మొదటి రోజు ఐదు నామినేషన్లు దాఖలు

by Disha Web Desk 15 |
మొదటి రోజు ఐదు నామినేషన్లు దాఖలు
X

దిశ, మెదక్ ప్రతినిధి : పార్లమెంట్ ఎన్నికల నామినేషప్ల పర్వం షురూ అయింది. మొదటి రోజు మెదక్ ఎంపీ స్థానానికి ఐదు నామినేషన్ లు వచ్చినట్టు జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాహుల్ రాజ్ తెలిపారు. గురువారం నుంచి పార్లమెంట్ స్థానానికి నామినేషన్ ల పర్వం మొదలు కాగా మొదటి రోజు ఐదు నామినేషన్ లు దాఖలు అయ్యాయి.

ఇందులో కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు తరఫున మెదక్ ఎంఎల్ఏ రోహిత్ రావు, ఆవుల రాజి రెడ్డి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ అభ్యర్థి ఎం.రఘునందన్ రావు నామినేషన్ ఒక సెట్ వేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా చిక్కు పల్లీ నవీన్ కుమార్ ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. తెలంగాణ ప్రజా శక్తి పార్టీ అభ్యర్థిగా దొడ్ల వెంకటేశం 2 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారని తెలిపారు.

Next Story

Most Viewed