బీజేపీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలి

by Disha Web Desk 15 |
బీజేపీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలి
X

దిశ, మిరుదొడ్డి : మెదక్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని బీజేవైఎం మండల అధ్యక్షుడు లింగాల సదానంద రెడ్డి అన్నారు. మంగళవారం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నీలం దినేష్ ఆధ్వర్యంలో మిరుదొడ్డి మండల కేంద్రంలో నమో యువ చోపాల్ నూతన ఓటర్ల తో 400 పే చర్చ కార్యక్రమం నిర్వహించారు.

మళ్లీ నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి రావడానికి నూతన ఓటర్లు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మిరుదొడ్డి మండల అధ్యక్షుడు ఎలుముల దేవరాజు, బీజేవైఎం సిద్దిపేట జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్ పెద్ద కురుమ కరుణాకర్, బత్తిని అనిల్, చిట్కుల అజయ్ రెడ్డి, పోడేటి నర్సింలు, నూతన ఓటర్లు, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed