కాంగ్రెస్ లోకి మెదక్ డీసీసీబీ చైర్మన్

by Disha Web Desk 15 |
కాంగ్రెస్ లోకి మెదక్ డీసీసీబీ చైర్మన్
X

దిశ, సంగారెడ్డి బ్యూరో/కొండపాక : మాజీ సీఎం కేసీఆర్ ఇలాకా గజ్వేల్ నియోజకవర్గంలో గులాబీ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కారు దిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, మరి కొందరు బీఆర్ఎస్ నాయకులు కారు పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన చిట్టి దేవేందర్ రెడ్డి, జిల్లా సర్పంచ్ ఫోరం మాజీ అధ్యక్షుడు ,

దుద్దెడ మాజీ సర్పంచ్ ఆరెపల్లి మహదేవ్ గౌడ్ , కొండపాక మాజీ సర్పంచ్ చిట్టి మాధురి రెడ్డి, కోనాయిపల్లి మాజీ సర్పంచ్ మిట్టపల్లి బుుషి, పీఏసీఎస్ డైరెక్టర్ బూర్గుల సురేందర్ రావు, ఎల్లు శ్రీనివాస్ రెడ్డి, కుకునూర్ పల్లి మాజీ ఉప సర్పంచ్ జనగామ బాలగౌడ్ తదితరులు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, చిలుముల మదన్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు వాసరి లింగరావు, బోడపట్ల ఐలం శివ, కందూరి ఐలయ్య , రెడ్డమైన రవి కిష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed