కాంగ్రెస్, బీజేపీ దొందూదొందే

by Disha Web Desk 15 |
కాంగ్రెస్, బీజేపీ దొందూదొందే
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : కాంగ్రెస్, బీజేపీ దొందూదొందే అని, వాటికి ఓటుతో బుద్ది చెప్పాలని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పిలుపునిచ్చారు. ఆటో కార్మికులతో హరీష్ రావు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ ఆటో కార్మికుల జీవితాలను ఆగం చేసిందన్నారు. ఆటో కార్మికులకు నెలకు పదివేల జీవన భృతి ఇవ్వాలని

అసెంబ్లీ వేదికగా ప్రశ్నిస్తే ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. దీనికి తోడు 40 మంది ఆటో కార్మికులు చనిపోయినా కాంగ్రెస్ నాయకులు కనీసం పరామర్శించలేదని మండిపడ్డారు. 6 లక్షల మంది ఆటోకార్మికులను కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్డున పడేసిందన్నారు. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి నడ్డివిరిచిందన్నారు. ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని గెలిపించి మెదక్ గులాబీ జెండా అడ్డా అని నిరోపించాలన్నారు.

Next Story

Most Viewed