ఆరు గ్యారెంటీలను అమలు చేసి ప్రజా పాలన అందిస్తాం : వంశీచంద్ రెడ్డి

by Disha Web Desk 23 |
ఆరు గ్యారెంటీలను అమలు చేసి ప్రజా పాలన అందిస్తాం : వంశీచంద్ రెడ్డి
X

దిశ,ధన్వాడ: కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను ఆరు నూరైనా నూరారైన అమలు చేసి తీరుతామని కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని చర్లపల్లి, హన్మన్ పల్లి, కొండాపూర్, కిష్టాపూర్, రామకిష్టయ్య పల్లి గ్రామాలలో ఎమ్మెల్యే చిట్టెం పర్నిక రెడ్డి తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం కిష్టాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మన జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం, మన అందరి అదృష్టం అన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసి బడుగు బలహీన వర్గాలకు మేలు చేసి ప్రజా పాలన అందిస్తామని అన్నారు. రైతు భరోసా (రైతు బంధు) పథకం ద్వారా అందించే పెట్టుబడి సాయాన్ని ఈ నెల 8 లోపు పూర్తిస్థాయిలో రైతులందరికీ అందిస్తామన్నారు.గత ప్రభుత్వం గొర్రెల పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారులచే డీడీ లు కట్టించుకొని గొర్రెలను ఇవ్వకుండా మోసం చేసిందన్నారు.

లబ్ధిదారులు ఎవరు అధైర్య పడొద్దని ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి చొరవతో మీరు కట్టిన డీడీల డబ్బులు మీకు చెల్లిస్తామని, అలాగే జీవో 69 ద్వారా ఈ ప్రాంత చిరకాల కోరిక అయిన రామసముద్రం కి సాగునీరు అందించి హామీ ఇచ్చారు. ఎన్నికల తర్వాత ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు లాంటి అనేక పథకాలు అందజేస్తామన్నారు. ఇలాంటి సంక్షేమ పథకాలు అందించే కాంగ్రెస్ పార్టీని ఆదరించి ఈనెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నరహరి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గాజుల శివకుమార్, సీనియర్ నాయకులు లక్ష్మయ్య గౌడ్, రాజేందర్ రెడ్డి, దామోదర్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, చిట్టెం రాఘవేందర్ రెడ్డి,ఆనంద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed