- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బీజేపీ ఎంపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ ను గెలిపించండి : మురుగన్
దిశ,వంగూర్: భారత ప్రధాని నరేంద్ర మోడీ తోనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని కేంద్ర సమాచార సహాయ శాఖ మంత్రి మురుగన్ అన్నారు. గురువారం వంగూరు గేటు వద్ద వైవి ఫంక్షన్ హాల్ లో మండల బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎంపీ రాములు హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కేంద్ర సమాచార సహాయ శాఖ మంత్రి మురుగన్, ఎంపీ రాములు మాట్లాడారు. భారత దేశం మరింత అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో బీజేపీ పాలన రావాలని అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ ను గెలిపించాలని మురుగన్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆర్టికల్ 370 రద్దు అదే విధంగా అయోధ్యలో శ్రీరాముని ఆలయాన్ని నిర్మించిన చరిత్ర నరేంద్ర మోడీదని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు మాయ మాటలు చెప్పి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారని అలాంటి మాయ మాటలను నమ్మకుండా బిజెపిని గెలిపించాలని వారు కోరారు. అదేవిధంగా మండల పరిధిలోని పలు గ్రామాలు రంగాపూర్, వంగూర్, పోల్కంపల్లి, నిజాంబాద్, గాజర, ఉప్పలపహాడ్, డిండి చింతపల్లి, ఉల్పర, కోనాపూర్ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులను నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎంపీ పోతుగంటి రాములు వారికి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాగి కొండల్ రెడ్డి, మండల అధ్యక్షులు ఖానాపురం భాస్కర్, అల్లే భీమయ్య, సైదులు, శ్రీధర్, బాలాజీ, మన్యా నాయక్, ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.