గద్వాల అభివృద్ధి కోసం సహకరించండి…

by Kalyani |   ( Updated:2024-07-06 11:07:15.0  )
గద్వాల అభివృద్ధి కోసం సహకరించండి…
X

దిశ, గద్వాల ప్రతినిధి: గద్వాల నియోజకవర్గం లో పెండింగ్ పనులను పూర్తి ఐయ్యే విధంగా సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి ని కోరినట్టు ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి తెలిపారు. శనివారం హైదరాబాద్ లోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ లోకి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ మారడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి కి గద్వాల నియోజకవర్గం లోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి ఐయ్యేందుకు సహకరించాలని, నెట్టెంపాడు ప్రాజెక్టు కింద ఉన్న ర్యాలంపాడు రిజర్వాయర్ ఆనకట్ట నాణ్యత లేక నీరు లీక్ అవుతుందని రిజర్వాయర్ ను నాలుగు టీఎంసీలు నిల్వ చేసేందుకు ఆనకట్ట మరమ్మతులకు సహకరించాలని, అదే విధంగా గట్టు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ త్వరితగతిన పూర్తి చేసేందుకు నిధులు ఇవ్వవలసిందిగా కోరడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డి గద్వాల అభివృద్ధికి సహకారం ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. అదే విధంగా సోమవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం లో ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరిగేషన్ శాఖ పై ఉమ్మడి జిల్లా ప్రాజెక్ట్ లపై రివ్యూ చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే లు దానం నాగేంద్రం, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story