- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కాన్పు కోసం వస్తే కడుపు కోత..
దిశ,గద్వాల: కాన్పు కోసం వస్తే కడుపు కోత మిగిల్చారు. వైద్య సేవల్లో నిర్లక్ష్యంతోనే తన బిడ్డ మృతిచెందాడని ఓ తండ్రి కన్నీరుమున్నీరుగా విలపించారు. సోమవారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితులు వీరేష్ తెలిపిన వివరాల ప్రకారం గట్టు మండలం బోయలగూడెంకు చెందిన సుజాత కు పురిటి నొప్పులు రాగ మూడో కాన్పు కోసం గట్టు మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంలో అడ్మిట్ చేశారు. అక్కడి వైద్యుల సూచనమేరకు గత వారం జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమెను చేర్పించారు. ఇక్కడ వైద్య పరీక్షల అనంతరం తిరిగి గట్టు పిహెచ్ సి కి వెళ్లారు. సోమవారం పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పురిటి నొప్పుల బాధపడుతున్న గర్బిణిని జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు.
స్కానింగ్ కోసం ఓ ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్ రెఫర్ చేశారు స్కానింగ్ అనంతరం కాన్పు కోసం థియేటర్ లో కి తీసుకెళ్లగా కొద్ది సేపటికి బాబు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. పురిటినొప్పులతో బాధపడుతున్న తన భార్యను జిల్లా ఆసుపత్రికి తీసుకరాగ సుమారు 2 గంటల పాటు వైద్యులు ఎవరు పట్టించుకోలేదని, నొప్పులు భరించలేక మొత్తుకుంటున్నా సిబ్బంది పట్టించుకోలేదని, కాళ్లా వేళ్లాపడినా ఏం చేయాలో మాకు తెలుసులే అంటూ చీదరించుకున్నారని బాధితులు ఆరోపించారు. జిల్లా ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే పసికందు మృతిచెందాడని, విచారణ జరిపి వైద్యులపై చర్యలు తీసుకోవాలని బాధితులు ఆరోపించారు.
వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే
విషయం తెలుసుకున్న గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు. వైద్యుల నిర్లక్ష్యంతో గర్భిణి కడుపులో చిన్నారి మృతి చెందారని కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయించిన రోగుల పట్ల వైద్యులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ప్రైవేటు ఆసుపత్రిలలో వైద్యం చేయడానికి ఆసక్తి చూపెడుతున్నారని, నిరుపేదల ప్రాణాలను గాలోకి వదిలేస్తున్నారని మండిపడ్డారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఘటనపై జిల్లా సూపరింటెండెంట్ డాక్టర్ కిషోర్ కుమార్ ను వివరణ కోరగా విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.