అచ్చంపేట నియోజకవర్గం చారకొండ మండల బీఆర్ఎస్ పార్టీ కి భారీ షాక్…

by Disha Web Desk 11 |
అచ్చంపేట నియోజకవర్గం చారకొండ మండల బీఆర్ఎస్ పార్టీ కి భారీ షాక్…
X

దిశ, చారకొండ/వంగూర్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కీ భారీ షాక్ తగిలింది. అచ్చంపేట నియోజకవర్గం చారకొండ, వంగూర్ మండలాలకు సంబంధించిన ఇద్దరు ఎంపీపీలు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ లు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెడ్డి సమక్షంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. చారకొండ మండల ఎంపీపీ గుండె నిర్మల విజెందర్ గౌడ్, పీఎస్ సీఎస్ చైర్మన్ జెల్ల గురువయ్య గౌడ్, చారకొండ సర్పంచ్ గుండె విజెందగౌడ్, మాజీ ఉప సర్పంచ్ రాణి నరేందర్ రెడ్డి, కమాల్ పూర్ మాజీ సర్పంచ్ అలివేలు శ్రీనివాస్, ఎంపీటీసీ లలితా బాల్ సింగ్ నాయకులు కుంభం కొండల్, రాజేష్ గౌడ్, జనార్దన్ రెడ్డి, మల్లేష్, శ్రీనివాస్ రెడ్డి లతో పాటు ఇతర ముఖ్య నాయకులు పార్టీలో చేరారు.

వంగూర్ మండలానికి చెందిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ చేరారు. ఎంపీపీ బీమమ్మ, యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు లాలు యాదవ్, కొండారెడ్డి పల్లి గ్రామానికి చెందిన ముఖ్య నాయకులు కుమార్, బాబు, శేఖర్, తుమ్మలపల్లి గ్రామానికి చెందిన మాజీ పిఎసిఎస్ చైర్మన్ చిమ్ముల రాజశేఖర్ రెడ్డి , వెలమలపల్లి గ్రామ మాజీ సర్పంచ్ లింగమ్మ, మాజీ ఉప సర్పంచ్ రామస్వామి ఆధ్వర్యంలో దాదాపుగా 22 మంది బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్, కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకుడు చార కొండ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed