- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఫస్ట్ టైమ్ FIR నమోదైంది.. గొప్పగా భావిస్తున్నా: మాధవీలత ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, వెబ్డెస్క్: తనపై నమోదు అయిన కేసుపై హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిని మాధవీలత స్పందించారు. మంగళవారం హనుమాన్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్లో నిర్వహించిన శోభాయాత్రలో మాధవీలత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎలాంటి తప్పు లేకుండా నాపై కేసు పెట్టారని అన్నారు. తొలిసారి తనపై ఎఫ్ఐఆర్ నమోదైందని.. దీనిని గొప్పగా భావిస్తున్నానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాముని బాణంపై కేసు వేశారని భావిస్తున్నానని అన్నారు. కాగా, ఈ నెల 17న శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న మాధవీలత.. మసీదుపైకి బాణం ఎక్కుపెట్టినట్టుగా ఫోజు ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగా వైరల్ అయ్యింది. ఈ క్రమంలో మాధవీలత ఎన్నికల కోడ్ ఉల్లంఘించి మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు పోలీసులు ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.