గుడుంబా స్థావరాలపై పోలీసుల మెరుపు దాడి..

by Disha Web Desk 4 |
గుడుంబా స్థావరాలపై పోలీసుల మెరుపు దాడి..
X

దిశ, బయ్యారం : బయ్యారం మండలంలో యధేచ్చగా నాటు సారా బట్టీలు పెడుతూ, గుడుంబా తాగి ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని సమాచారం అందుకున్న పోలీసులు బయ్యారం మండలంలోని గంధం పల్లి గ్రామ శివారులో గుడుంబా స్థావరాలపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 20 లీటర్లు నాటుసారా, 200 బెల్లం వాష్ ధ్వంసం చేసారు. ఈ సందర్భంగా అక్రమబెల్లం, సారా బట్టీలను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ గ్రామాల్లో బెల్లం రవాణా చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. అదే విధంగా గుడుంబా కాసే వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని నాటు సారా అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుడుంబా నివారణపై స్థానికులు అవగాహనా కల్పించాలన్నారు. గడుంబా తయారీ దారులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ దాడుల్లో బయ్యారం ఎస్ఐ మౌలానాతో పాటు ఇతర పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed