- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
రుణమాఫీ చారిత్రాత్మక నిర్ణయం : మంత్రి పొంగులేటి
దిశ, తెలంగాణ బ్యూరో: ఇది రైతు రాజ్యం. రైతు దేశానికి వెన్నెముక. ఆ రైతుకు వెన్నుదన్నుగా నిలవాలనే ధృడ సంకల్పంతో అన్నదాతలకు ఆర్థిక సహకారం అందజేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం రైతులకు రుణ విముక్తి కల్పించి, చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని రెవెన్యూ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రూ.లక్ష రుణం ఒకసారి మాఫీ చేయడం సాధ్యం కాదు. అసలు జరగదని ఆనాటి సీఎం కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలో ప్రకటిస్తే, ఈనాడు సీఎం రేవంత్ రెడ్డి ఏకకాలంలో రూ.రెండు లక్షల రుణమాఫీ చేస్తూ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారని, అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అయ్యింది. ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీకి ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం సహకరించపోయినా రైతాంగానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాం. ఆగష్టు 15వ తేదీ లోగా రైతు రుణాలను మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కానీ అంతకంటే నెల రోజుల ముందుగానే హామీని నిలబెట్టుకుని రైతన్నల విషయంలో తమ నిబద్ధతను చాటుకున్నామన్నారు. జూలై 18వ తేదీ లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తున్నామని, రైతు ఋణ ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నామన్నారు. ఈ రోజు రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించవలసిన రోజుగా అభివర్ణించారు. 16 సంవత్సరాల క్రితం కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి సంబంధించి 72 వేల కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలు, వడ్డీలను మాఫీ చేసిందని గుర్తు చేశారు.
లాభసాటిగా మారాలి
తెలంగాణలో వ్యవసాయం మరింత లాభసాటిగా మారాలని మంత్రి పొంగులేటి అభిప్రాయపడ్డారు. అంతిమంగా రైతు సోదరులు ఆర్థికంగా బలపడడానికి రైతాంగానికి ఎల్లవేళలా ఈ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం దండుగా కాదు పండుగ అనే విధంగా పరిస్థితిని మారుస్తున్నామని రైతన్న కష్టాలు కడతేర్చాలని నడుంబిగించామన్నారు. రాష్ట్రంలో 60 శాతం జనాభా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నది. వ్యవసాయ రంగం బాగుంటేనే రాష్ట్ర ప్రజలు రాష్ట్ర బాగుంటుంది. వ్యవసాయ రంగం అభివృద్ధికి మించిన ప్రాధాన్యత ఈ ప్రభుత్వానికి మరొకటి లేదన్నారు. భవిష్యత్తులో వ్యవసాయాన్ని ఉజ్వలంగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ సంకల్పం. రాబోయే కాలంలో ప్రభుత్వం రైతులకు మరింత అండగా నిలుస్తుంది. రైతును రాజు చేయాలన్నది ప్రభుత్వ అంతిమ లక్ష్యమన్నారు.