- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
KTR: నాగలి ఎప్పుడూ ఒంటరి కాదు.. మాజీ మంత్రి కేటీఆర్ ఆవేదన

దిశ, డైనమిక్ బ్యూరో: సంఘర్షణ మన రైతులకు కొత్త కాదు.. మోసం ఈ కాంగ్రెస్ (Congress) పార్టీకి కొత్తకాదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) విమర్శించారు. ఈ మేరకు ఆయన శనివారం (X) ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో దగా పడ్డ వ్యవసాయ రంగాన్ని పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో, కేసీఆర్ సారథ్యంలో రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ, సాగునీళ్లు, ఉచితంగా 24 గంటల కరంటు, వంద శాతం పంటల కొనుగోళ్లతో ఆత్మస్థైర్యం నింపి అన్నదాతకు వెన్నెముకగా నిలిస్తే.. ఏడాది కాంగ్రెస్ పాలనలో మళ్లీ తిరోగమనం మొదలయిందని పేర్కొన్నారు. అన్నదాతలారా ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదు.. అని పిలుపునిచ్చారు. నాగలి ఎప్పుడూ ఒంటరి కాదని, నాగలి ఈ దేశపు భవిష్యత్తు అని తెలిపారు. జోడెద్దుల మాదిరిగా (BRS) బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది అని భరోసా ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లా హత్నూర్, వర్తమన్నూర్ గ్రామ రైతు నర్సయ్య రుణమాఫీ కాలేదని ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.