- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కిషన్ రెడ్డి, బండి సంజయ్కు KTR రాజీనామా సవాల్
దిశ, వెబ్డెస్క్: బీజేపీ నేతలైన కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన సవాల్ విసిరారు. ఇవాళ సిరిసిల్లలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ మాట్లాడారు. బీజేపీ పది ఏళ్లలో రూ.30 లక్షల కోట్లు దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి తీసుకుని పెట్రోల్ బంక్ కు పోతే ముక్కు పిండి వసూలు చేశారని అన్నారు. పదేళ్లలో నరేంద్ర మోడీ పేదవాళ్ల రక్తం పీల్చి రూ. 30 కోట్లు వసూలు చేశారని మండిపడ్డారు. అందులో రూ.14 లక్షల కోట్లు వాళ్ల దోస్తులు అదానీ, అంబానీలకు రుణమాఫీ చేశారని అన్నారు. నేను చెప్పిన ఈ మాటలు తప్పని కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీలో ఎవరైనా నిరూపించగలిగితే రేపు తెల్లవారేసరికి తెలంగాణ తల్లి సాక్షిగా నా రాజీనామాను బీజేపీ నాయకుల మొకాన కొడుతా అని సవాల్ విసిరారు. 30 లక్షల కోట్లు కాకులను కొట్టి గద్దలను కొట్టినట్లు పేదలను పీడిచ్చి పెద్దవాళ్లకిచ్చిండు నరేంద్ర మోడీ అంటూ కేటీఆర్ సిరిసిల్లలో మోడీపై మండిపడ్డారు.