- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బీఆర్ఎస్ గెలవబోయే తొలి ఎంపీ సీటు అదే.. మాజీ మంత్రి కేటీఆర్
దిశ, తెలంగాణ బ్యూరో: ఇచ్చిన హామీలు అమలు చేయటం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ చేతనైతలేదని, ఫోన్ ట్యాపింగ్ పేరుతో రోజుకో లీక్ ఇచ్చి సీఎం రేవంత్ రెడ్డి టైమ్ పాస్ చేస్తుండని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ భవన్లో గురువారం సాయంత్రం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అధ్యక్షతన జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ బూత్ స్థాయి విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కొత్త కదా కొన్ని రోజులు భయపెట్టే పని చేస్తారని, కేడర్ ధైర్యంగా ఉండాలని అండగా పార్టీ ఉంటుందని భరోసా ఇచ్చారు. వచ్చే 20 రోజుల పాటు కలిసికట్టుగా అందరం పనిచేద్దామని లోక్ సభ ఎన్నికల్లో సత్తాచాటుదామన్నారు. మత విద్వేషాల పేరుతో బీజేపీ చేసే చిల్లర రాజకీయాలను పట్టించుకోవద్దు అన్నారు.
పార్టీ మారిన ఎమ్మెల్యే దానం నాగేందర్ సీటు పోవటం ఖాయమని, ఉప ఎన్నిక రావటం తథ్యం అని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కిషన్ రెడ్డిని కూడా ఓడించేది ఒక్క బీఆర్ఎస్ మాత్రమేనన్నారు. కిషన్ రెడ్డి కరోనా టైమ్లో సికింద్రాబాద్లో కుర్ కురే ప్యాకెట్లు పంచాడని దుయ్యబట్టారు. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ గెలవబోయే మొదటి సీటు సికింద్రాబాద్ అని స్పష్టం చేశారు. దేశంలో విపక్షాలు ఐతే జేబులో లేదంటే జైల్లో అన్నట్లుగా ఉంది ప్రధాని మోడీ విధానం ఉందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత విచిత్రమైన పరిస్థితి కనబడుతోందన్నారు. రేవంత్ రెడ్డి అసలు ఎవరి కోసం పనిచేస్తున్నాడు. మోడీ కోసమా? రాహుల్ గాంధీ కోసమా? అని ప్రశ్నించారు. మైనార్టీలు కాంగ్రెస్కు వేసే ఒక్కో ఓటు అది బీజేపీకే వెళ్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుసంస్కారి, మూర్ఖుడు అని దుయ్యబట్టారు.