ఈసారి నాకు ఓటు వేస్తే ఖమ్మం అభివృద్ధికి ఓటు వేసినట్టే

by Disha Web Desk 15 |
ఈసారి నాకు ఓటు వేస్తే ఖమ్మం అభివృద్ధికి ఓటు వేసినట్టే
X

దిశ ఖమ్మం టౌన్ : ఖమ్మంలో ఈసారి తనకు ఓటు వేస్తే జిల్లా అభివృద్ధికి ఓటు వేసినట్టేనని బీజేపీ ఖమ్మం ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద రావు పేర్కొన్నారు. శనివారం సాయంత్రం బీజేపీ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర మహిళా మోర్చా శక్తి సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వినోద్ రావు ముఖ్య​ అతిథిగా విచ్చేసి మాట్లాడారు. గత పది సంవత్సరాలలో ఖమ్మం అభివృద్ధిని అడ్డుకున్న ప్రతిపక్ష పార్టీలు వారంటీ లేని గ్యారంటీలు ఇచ్చాయని తెలిపారు. ఇప్పుడున్న ప్రభుత్వంతో ఎంతమేరకు పథకాలు అందుతున్నాయో ఒకసారి మహిళలు ఆలోచించాలి అన్నారు. ఈసారి మీరు వేసే ఓటు ఖమ్మం అభివృద్ధి చెందడానికే వేస్తున్నారని ఆలోచించుకోండి అన్నారు.

మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతా రెడ్డి మాట్లాడుతూ 2014 మోదీ ఎన్నిక కాకముందు గత ప్రభుత్వం 14 కోట్ల గ్యాస్ కనెక్షన్స్ మాత్రమే ఇచ్చిందన్నారు. మోదీ అధికారంలోకి వచ్చాక 41 కోట్ల గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చినట్టు తెలిపారు. మహిళా మోర్చా మాజీ అధ్యక్షురాలు అరుణ మాట్లాడుతూ మహిళలకు పది లక్షల డ్వాక్రా రుణాలు తీసుకొచ్చిన ఘనత నరేంద్రమోదీకే దక్కుతుంది అన్నారు. మూడు వందల ముప్పై రూపాయలతో రెండు లక్షల మహిళా జీవిత బీమా తీసుకొచ్చిన ఘనత కూడా మోదీ దే అన్నారు. మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి విజయ, పార్లమెంట్ మహిళా మోర్చా కన్వీనర్ సరస్వతి, జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ అల్లిక అంజయ్య పాల్గొన్నారు.



Next Story

Most Viewed