- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బీఆర్ఎస్, కాంగ్రెస్ లకు ఓటు వేస్తే ఓటు వృథా : తాండ్ర వినోద్ రావు
దిశ, పాల్వంచ టౌన్: కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా దమ్మపేట సెంటర్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ అధ్యక్షులు రంగా కిరణ్, జిల్లా నాయకులు ఏర్పాటు చేసిన భారీ ర్యాలీలో బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు పాల్గొన్నారు. ర్యాలీలో ప్రజలకు అభివాదం చేస్తూ ఓటు అభ్యర్థించారు. అంబేద్కర్ సెంటర్ దగ్గర మాట్లాడుతూ… రామ రాజ్యానికి ఉదాహరణ మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలన అన్నారు. దేశంలో దాదాపు నాలుగు వందల పైగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం బీజేపీ అని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి పది సీట్లకు పైగా గెలుస్తుందని చెప్పారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న గత పది సంవత్సరాలలో పాల్వంచకు చేసిన అభివృద్ధి ఏమి లేదన్నారు. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ లాంటిదే అని ఆ రెండు పార్టీలకు ఓటు వేస్తే వృధా అవుతుందని అన్నారు. తన విద్యాభ్యాసం పాల్వంచ లోనే అభ్యసించానని గుర్తు చేశారు. పాల్వంచ ప్రజలకు ఏమి కావాలో తనకు తెలుసన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి తనని గెలిపించాలని కోరారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని జైశ్రీరామ్ జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పోలిశెట్టి వెంకటేశ్వర్లు, బుడగం రవి, మురళి తదితరులు పాల్గొన్నారు.