- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
మట్టి గణపతిని పూజిద్దాం...పర్యావరణాన్ని కాపాడుదాం
దిశ, కొత్తగూడెం : మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడుదాం అని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు, ప్రతి సంవత్సరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ విగ్రహాలను రాష్ట్రమంతటా ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈనెల 7వ తేదీన వినాయక చవితిని పురస్కరించుకుని కొత్తగూడెం, పాల్వంచ పరిధిలో రెండు వేల మట్టి గణపతి విగ్రహాల ఉచిత పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
శుక్రవారం కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ లో ఉన్న సింగరేణి పాఠశాల ముందు మట్టి గణపతి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ మట్టి గణపతి విగ్రహాల స్టాల్ ని ప్రారంభించి ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంట్లో మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, పర్యావరణ ఇంజనీర్ బి. రవీందర్, కార్యాలయ సిబ్బంది, పాల్గొన్నారు.