బీజేపీలో పలువురు సీపీఎం నేతల చేరిక

by Disha Web Desk 15 |
బీజేపీలో పలువురు సీపీఎం నేతల చేరిక
X

దిశ, ఖమ్మం రూరల్ : ఖమ్మం రూరల్ మండలం కాచిరాజుగూడెం గ్రామానికి చెందిన సీపీఎం ముఖ్య నాయకులు శనివారం బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నున్న రవి ఆధ్వర్యంలో పార్టీ పార్లమెంటు క్యాంపు కార్యాలయంలో పార్లమెంటు అభ్యర్థి వినోద్ రావు సమక్షంలో బీజేపీలో పార్టీలో చేరారు. అద్దంకి గురున్నాధం, గోపి, మహేష్, సాయి, వెంకటేష్, హరి, సురేష్, ఉపేందర్, చైతన్య, మహేష్, నర్సింహ, వీరబాబు, హరికృష్ణ, శంకర్, ఏలూరి కిరణ్ తో పాటు 50 మంది యువకులు నరేంద్ర మోడీ చేస్తున్న

అభివృద్ధికి ఆకర్షితులై బీజేపీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం కృషి చేయాల్సిందిగా వినోద్ రావు వారిని కోరారు. గత ప్రభుత్వాలు బడుగు బలహీన వర్గాలకు చేసిన అభివృద్ధి శూన్యం అన్నారు. ఎన్నికల్లో గెలిచిన తరువాత వారి స్వలాభం కోసం చూసుకున్నారే కానీ జిల్లా అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. ఈసారి ఖమ్మంలో కమలం జెండా ఎగరడం ఖాయమన్నారు. ఈ సందర్భంగా నున్న రవి మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ ప్రభంజనం మాత్రమే కొనసాగుతుందన్నారు. గిరిజనులకు కేవలం బీజేపీ మాత్రమే న్యాయం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు భాన్య నాయక్, గజ్జెల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed