రోటవేటర్ లో ఇరుక్కొని రైతు మృతి

by Disha Web Desk 15 |
రోటవేటర్ లో ఇరుక్కొని రైతు మృతి
X

దిశ, మధిర : మండల పరిధిలోని నిధానపురం గ్రామానికి చెందిన అమరవాది నర్సిరెడ్డి ( 58 ) అనే రైతు గురువారం ట్రాక్టర్ కిందపడి మృతి చెందాడు. మృతుడు కౌలుకు తీసుకున్న పొలంలో మిరప తోట వేశాడు. పొలంలో మిరప పండ్లు కోయడం పూర్తి కావడంతో మిరప కట్టెను ట్రాక్టర్ తో తొలగించేందుకు రోటవేటర్ వేస్తున్నాడు. ఈ క్రమంలో రోటవేటర్ లో ఇరుక్కున్న రాళ్లు , గడ్డిని తొలగిస్తున్న సమయంలో ఆటోమెటిక్ గా రోటవేటర్ గేరు పడడంతో ట్రాక్టర్ ముందుకు కదలడంతో ప్రమాదవశాత్తు రోటవేటర్ లో తల ఇరుక్కుంది. దాంతో తల పై భాగం నుజ్జు నుజ్జు అయ్యి అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతుడికి భార్య , ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.


Next Story