ఐదో రోజు 11 నామినేషన్లు

by Disha Web Desk 15 |
ఐదో రోజు 11 నామినేషన్లు
X

దిశ, ఖమ్మం సిటీ : లోక్​సభ సాధారణ ఎన్నికలను పురస్కరించుకుని ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలో మంగళవారం ఐదవ రోజున 11 నామినేషన్లు స్వీకరించినట్లు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. 17 ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థులుగా కట్టకొజ్వల నాగేశ్వరరావు ఒక సెట్, అవుటపల్లి రాంబాబు ఒక సెట్, కాశిమల్ల నాగేశ్వరరావు ఒక సెట్, షేక్ సిరాజోద్దీన్ రెండు సెట్లు,

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుండి రెండు సెట్లను రామసహాయం రఘురాం రెడ్డి తరఫున మద్దినేని స్వర్ణకుమారి, బొర్రా రాజశేఖర్, బీజేపీ నుండి రెండు సెట్లు తాండ్ర వినోద్ రావు తరపున సుగ్గుల వెంకటేశ్వర గుప్తా, గంటల విద్యాసాగర్, సోషలిస్ట్ పార్టీ నుండి షేక్ రైస్ అన్వర్ ఒక సెట్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుండి కాశిన ఏవీజె. ప్రసాద్ ఒక సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారని ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి పేర్కొన్నారు.



Next Story

Most Viewed