వాటర్ ట్యాంక్ ఎక్కిన మాజీ రేషన్ డీలర్లు.. పెట్రోల్ బాటిళ్లతో నిరసన

by Jakkula Mamatha |
వాటర్ ట్యాంక్ ఎక్కిన మాజీ రేషన్ డీలర్లు.. పెట్రోల్ బాటిళ్లతో నిరసన
X

దిశ ప్రతినిధి,రాజన్న సిరిసిల్ల: తమ రేషన్ షాపులు తమకే కేటాయించాలని మాజీ రేషన్ డీలర్లు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇటీవల ప్రభుత్వం భర్తీ చేసిన 58 రేషన్ షాపులను తమకే కేటాయించాలని గతంలో రేషన్ డీలర్లుగా పని చేసిన దాదాపు 30 మంది జిల్లా కేంద్రంలోని సాయి నగర్ వాటర్ ట్యాంక్ ఎక్కి పెట్రోల్ బాటిల్‌తో గురువారం నిరసన తెలిపారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బాధితులను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, కలెక్టర్ వెంటనే రావాలని, పోలీసులు పైకి రావడానికి ప్రయత్నిస్తే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని బాధితులు హెచ్చరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్రమంగా నియమించిన రేషన్ డీలర్ షాపుల భర్తీని వెంటనే రద్దు చేసి, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story