మా సమాధులపై ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మించండి

by Shiva |   ( Updated:2023-04-06 10:51:09.0  )
మా సమాధులపై ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మించండి
X

ఆర్డీవో, డీఎస్పీలకు స్పష్టం చేసిన పాషిగాం గ్రామస్థులు

దిశ,వెల్గటూర్: సర్వేనెం.1090లో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మించదలచుకుంటే తమ సమాధులపైనే నిర్మించాలని ఆర్డీవో, డీఎస్పీలకు పాషిగాం గ్రామస్థులు స్పష్టం చేశారు. ఫ్యాక్టరీ ఇక్కడే కడితే మా ప్రాణాలు ఎలాగూ పోతాయి.. దాని కంటే ముందే తమను చంపేయాలని గ్రమస్థులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఇథనాల్ ఫ్యాక్టరీ మీద ప్రజలకు అవగాహన కల్పించడానికి గురువారం రోజున ఆర్డీవో మాధురి, డీఎస్పీ ప్రకాష్, సీఐ కోటేశ్వర్లు పాషిగాం గ్రామానికి వచ్చారు. ఈ నేపథ్యంలో పాషిగాం గ్రామస్థులతో పాటు నాలుగు నాలుగు గ్రామాల ప్రజలు ఆర్డీవో మాధురి డీఎస్పీ ప్రకాష్ కు స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed