ఎక్కడ గ్యాప్ వచ్చిందో తెలుసుకుంటా!.. గుత్తా కామెంట్స్ పై జగదీష్ రెడ్డి

by Disha Web Desk 5 |
ఎక్కడ గ్యాప్ వచ్చిందో తెలుసుకుంటా!.. గుత్తా కామెంట్స్ పై జగదీష్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన కామెంట్స్ పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్పందించారు. మీడియాతో మాట్లాడిన ఆయన గుత్తా సుఖేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ గెలవడానికే సలహాలు ఇచ్చారని, తప్పకుండా వారి సలహాలు పాటిస్తామని, వారు చెప్పే పద్దతిలో పార్టీ నిర్మాణం చేయడానికి ప్రయత్నిస్తామని అన్నారు. అలాగే కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడంపై దాని గురించి ఎక్కడ గ్యాప్ వచ్చిందో తెలుసుకుంటానని, నా వయసు తన రాజకీయ అనుభవం అంత లేదని తానే చెప్పానని, ఆయనకు రాజకీయ బిక్ష పెట్టినట్లు తానెప్పుడు అనలేదని స్పష్టం చేశారు. సుఖేందర్ రెడ్డి కామెంట్స్ సంచలనంగా ఏం లేవని మాములుగానే మాట్లాడినట్లు కనిపిస్తుందన్నారు. మా మధ్య ఎటువంటి గ్యాప్ లేదని, కేసీఆర్ గారు గౌరవించిన ప్రతీ ఒక్కరినీ తాను గౌరవించానని చెప్పారు.

కొన్ని పార్టీ మీటింగ్ లకు ఆయన రాకూడదు కనుకే ఆహ్వానించలేదని, అలాగే తనపై చేసిన కొన్ని కామెంట్స్ కి ఇప్పుడే సమాధానం చెప్పలేనని, వారితో సంప్రదించిన తర్వాత అన్ని విషయాలు వెల్లడిస్తానని తెలిపారు. కాగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ దెబ్బతినడానికి మంత్రులే కారణమని, పార్టీలో అంతర్గత సమస్యలు ఉన్నాయని, ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచే కేసీఆర్ అపాయింగ్ మెంట్ ఇవ్వలేదని కామెంట్స్ చేశారు. జేబులో 500 కూడా లేని కొంతమంది ఉద్యమాల పేరుతో రాజకీయాల్లోకి వచ్చి కోట్లు సంపాదించారని, తనను 16 సార్లు రిక్వెస్ట్ చేస్తేనే పార్టీలోకి వచ్చానని, అలాగే తన కొడుకు పోటీ చేయడం కొందరు జిల్లా నాయకులకే ఇష్టం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

https://twitter.com/i/status/1781661975581536609



Next Story

Most Viewed