కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి, మీకు అండగా మేము ఉంటాం : రంజిత్ రెడ్డి

by Disha Web Desk 11 |
కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి, మీకు అండగా మేము ఉంటాం : రంజిత్ రెడ్డి
X

దిశ, శేరిలింగంపల్లి : సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి అన్నారు. ఆదివారం మాదాపూర్ డివిజన్ పరిధిలోని సుభాష్ చంద్రబోస్ నగర్ లో ఇమ్రాన్ చౌదరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతుందని అన్నారు. చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంఛార్జీ జగదీశ్వర్ గౌడ్, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed