- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వడ్డెర కులస్తులకు గుడ్ న్యూస్... టీపీసీసీ చీఫ్ కీలక ప్రకటన

దిశ, వెబ్ డెస్క్: రవీంద్ర భారతిలో వడ్డే ఓబన్న 218వ జయంతోత్సవాలు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి తరం స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న చిరస్మరణీయుడని కొనియాడారు. బ్రిటిష్ సామ్రాజ్యానికి వెన్నులో వణుకు పుట్టించిన రేనాటి వీరుడు వడ్డే ఓబన్న అని పేర్కొన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యంపై బాల్య మిత్రుడు ఉయ్యాల వాడ నరసింహ రెడ్డితో కలిసి వడ్డే ఓబన్న వీరోచిత పోరాటం చేశారని గుర్తు చేశారు. తెల్ల దొరలపై పోరాటంలో సైన్యాధిక్షుడిగా ఓబన్న పోషించిన వీరోచిత పోరాటం చరిత్ర పుటల్లో నిలిచిపోతుందని తెలిపారు.
‘‘ఉయ్యాల వాడ నరసింహారెడ్డితో ఓబన్న మిత్రత్వం బాల్యం నుంచి మరణం వరకు సాగింది. 39 ఏళ్ల వయసులోనే వీర మరణం పొందిన రేనాటి వీరుడు వడ్డే ఓబన్న. కులాలను పక్కన పెట్టీ బీసీలు ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైంది. బీసీలకు మరెవరు సాటిరారు. కుల గణన సర్వే రాహుల్ గాంధీ చలవ. భారత్ జోడో యాత్ర సమయంలో ప్రజల ఆక్రందనలు అర్థం చేసుకున్నారు. ప్రధాని మోదీ వెసులు బాటుతో అంబానీ, అదానీ లక్షల కోట్లకు పరిగెడుతున్నారు. తెలంగాణలో కుల సర్వే 95 శాతం పూర్తయింది. కుల సర్వే రిపోర్టు ఆధారంగా బీసీల హక్కులు అడిగేందుకు ఆస్కారం. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో బీసీ ల పాత్ర కీలకం. వడ్డేర కులస్తులు కార్పొరేషన్ చైర్మన్ల పదవులతో సరిపెట్టుకోవద్దు ఎమ్మెల్యేలుగా పోటీ చేసే స్థాయికి రావాలి. కుల సర్వే ఆధారంగా రిజర్వేషన్లను డిమాండ్ చేసేందుకు ఆస్కారం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో 56 వేలకు పైగా ఉద్యగాలు ఇచ్చాం. కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్. పదేళ్ల కేసిఆర్ పాలనలో రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయింది. పదేళ్ల కేసిఆర్ పాలనలో ఒక్క కార్పొరేషన్కి సంవత్సరంలో లక్ష రూపాయలు ఇచ్చిన పాపానపోలే. బిఆర్ఎస్ నేతలు బీసీ లపై కపట ప్రేమ చూపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల అభివృద్ధి కట్టుబడి ఉంది. భవిష్యత్తులోనూ వడ్డేర కులానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది.’’ అని మహేశ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.