- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తెలంగాణ ప్రభుత్వం క్రీడాభివృద్ధికి కృషి

దిశ,ముషీరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో కృషి చేస్తుందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఇందుకోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందని చెప్పారు. 30 లక్షల రూపాయల వ్యయంతో ఇందిరాపార్కులో నూతనంగా ఏర్పాటు చేయనున్న కరాటే కోచింగ్సెంటర్షెడ్ నిర్మాణ పనులను మంగళవారం ఎమ్మెల్యే ముఠా గోపాల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నూతన షెడ్ల నిర్మాణంతో పాటు కోచింగ్కు కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడుతామన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ముఠా జైసింహ, షరీపుద్దీన్, ముచ్చకుర్తి ప్రభాకర్, మమ్మద్అలీ, శంకర్ముదిరాజ్, ఇందిరాపార్కు ఉద్యానవనశాఖ, అధికారి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.