అర్ధరాత్రి రోడ్డెక్కిన ఓయూ విద్యార్థులు.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిదే!

by Disha Web Desk 9 |
అర్ధరాత్రి రోడ్డెక్కిన ఓయూ విద్యార్థులు.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిదే!
X

దిశ, వెబ్‌డెస్క్: ఉస్మానియా యూనివర్సిటీలోని విద్యార్థులు నీటి సమస్యపై అర్థరాత్రి రోడ్డుపై ధర్నా చేపట్టారు. అర్ధరాత్రి తాగడానికి, వాడుకోవడానికి నీళ్లు కూడా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని రోడ్డు మీద బైఠాయించి శనివారం రాత్రి ఆందోళన చేపట్టారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని వాపోయారు. ఉదయం నుంచి నీళ్లు లేవని మొర పెట్టుకుంటే రాత్రి ఒక్క ట్యాంకర్ పంపారని వెల్లడించారు. అవి దేనికీ సరిపోలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వెంటనే అధికారులు స్సందించి.. నీటి సమస్యలు తీర్చాలని ఓయూ విద్యార్థులు డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed