కమ్యూనిటీ స్థలం ఆక్రమణకు యత్నం

by Sridhar Babu |
కమ్యూనిటీ స్థలం ఆక్రమణకు యత్నం
X

దిశ, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని జయనగర్ కాలనీకి చెందిన కమ్యూనిటీ హాల్ స్థలాన్ని కొందరు ప్రైవేటు వ్యక్తులు వచ్చి ప్రహరీ నిర్మిస్తుండడంతో కాలనీవాసులు అడ్డుకున్నారు. అక్కడే ఉన్న మహిళలను వీడియో తీస్తూ బెదిరించడంతో ఎమ్మెల్యే అరెకపూడి గాంధీకి ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గాంధీ జయనగర్ కాలనీకి చేరుకొని ప్రైవేటు వ్యక్తులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 30 సంవత్సరాల క్రితం జయనగర్ కాలనీ లేఅవుట్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఖాళీ స్థలంలో కమ్యూనిటీ హాల్ తో పాటు వినాయక చవితి వేడుకలు గత కొన్ని ఏళ్లుగా చేస్తున్నారని తెలిపారు.

కొందరు ప్రైవేటు వ్యక్తులు తప్పుడు నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి ల్యాండ్ తమదంటూ కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఇప్పటికే 2010 నుంచి 2024 వరకు హెచ్ఎండీఏకు ఆర్టీఏ ద్వారా ఎప్పటికప్పుడు దరఖాస్తు చేస్తే.. ఇక్కడ కాలనీకి సంబంధించిన పార్క్ ల్యాండ్ ఉందని అధికారులు బదులిచ్చారని తెలిపారు. ఇలాంటి వారి పైన ఇప్పటికే కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని, ఎన్నో ఏళ్లుగా ఈ స్థలాన్ని కాలనీవాసులు ఉపయోగిస్తుంటే ఇప్పుడు హైకోర్టు ఆర్డర్ పేరు మీద కబ్జా చేసేందుకు యత్నిస్తున్న వారి పైన చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed