ఆర్థిక లావాదేవీల విషయంలో ఓ వ్యక్తిపై కత్తితో దాడి...

by Disha Web Desk 11 |
ఆర్థిక లావాదేవీల విషయంలో ఓ వ్యక్తిపై కత్తితో దాడి...
X

దిశ, చంపాపేట్ : ఆర్థిక లావాదేవీల విషయంలో ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన గురువారం ఐ.ఎస్. సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బడంగ్ పేట్ ప్రాంతానికి చెందిన సాయి కుమార్ (26) కార్ల క్రయ విక్రయాల వ్యాపారం చేస్తుంటాడు. కాగా సాయి కుమార్ 2022 లో తన సోదరి వివాహం కోసం పెద్ద నాన్న వెంకటేశ్ కుమారుడైన సంతోష్ నగర్ కానిస్టేబుల్ మహేశ్ కుమార్ వద్ద రూ.2 లక్షలను 4 శాతం వడ్డీకి తీసుకున్నాడు. అప్పటి నుంచి సాయి కుమార్ తీసుకున్న డబ్బులకు వడ్డీ చెల్లిస్తూ ఉన్నాడు. కాగా మహేశ్ కుమార్ అసలు డబ్బులు ఇవ్వాలని గత కొన్ని రోజులుగా ఒత్తిడి తేస్తున్నాడు.

ఇందులో భాగంగా గురువారం డబ్బుల విషయం మాట్లాకుందామని సాయి కుమార్ కారులో మహేశ్ కుమార్ చంద్రయ్య హట్స్ లోని తన నివాసం వద్దకు చేరుకున్నారు. దీంతో డబ్బులు విషయమై మాట్లాడుతుండగా చిన్నపాటి గొడవ జరిగి మాట మాట పెరగడంతో మహేశ్ కుమార్ తో పాటు తండ్రి శ్రీశైలం, సోదరుడు జగదీష్ లతో కలిసి సాయి కుమార్ పై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ సంఘటనలో తీవ్ర గాయాలకు గురైన సాయి కుమార్ ను చికిత్స నిమిత్తం సాయి నర్సింగ్ హోమ్ ఆసుపత్రికి తరలించారు. దీనిపై బాధితుని తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed