సైదాబాద్ లోఓ వ్యక్తిపై కత్తి, రాడ్లతో దాడి...

by Disha Web Desk 11 |
సైదాబాద్ లోఓ వ్యక్తిపై కత్తి, రాడ్లతో దాడి...
X

దిశ, మలక్ పేట్ : ఓ వ్యక్తిపై కత్తి, రాడ్ లతో దాడికి పాల్పడిన సంఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సైదాబాద్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ నసీరుద్దీన్ అలియాస్ చాకు నసీర్ (37) వాహనాల ఫైనాన్స్ కార్యాలయంలో పని చేస్తుంటాడు. కాగా తన స్నేహితుని కుమారుడైన షాహినగర్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ మున్నా తరచూ మహమ్మద్ నసీరుద్దీన్ కి ఫోన్ చేసి ఫైనాన్స్ వాహనాల యజమానులను బెదిరించాలని కోరాడు. దీనికి మహమ్మద్ నసీరుద్దీన్ నిరాకరించాడు.

ఇది మనసులో పెట్టుకున్న మహమ్మద్ మున్నా గురువారం సాయంత్రం 4 గంటలకు మరోసారి నసీరుద్దీన్ కి ఫోన్ చేసి చంపేస్తానని బెదిరింపులకు పాల్పడడంతో ఫోన్ కట్ చేశాడు. అనంతరం సాయంత్రం 6 గంటల సమయంలో మున్నా తన స్నేహితులైన ఆసిఫ్, సధులతో కలిసి మొహమ్మద్ నసీరుద్దీన్ ఇంటికి వచ్చారు. అనంతరం నసిరుద్దిన్ ను ఇంట్లో నుంచి బయటకు పిలిచి మాట్లాడుకుందామని చెప్పి అతనిపై మున్నా కత్తితో దాడి చేయగా స్నేహితులు రాడ్ లతో దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచారు. దీనిపై బాధితుడు నసీరుద్దీన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed