Harish Rao: ఏపీ ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి హరీశ్‌రావు లేఖ

by Ramesh N |
Harish Rao: ఏపీ ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి హరీశ్‌రావు లేఖ
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ప్రాజెక్టుల అనుమతుల సాధనలో విఫలమవడంతో ప్రాజెక్టుల నిర్మాణం ఆలస్యం అవుతోందని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) తెలిపారు. సోమవారం తెలంగాణ ప్రాజెక్టులపై (Kishan Reddy) కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు ద్వారా 200 టీఎంసీల గోదావరి నీటిని పెన్నాబేసిన్‌కు తరలించడం వల్ల తెలంగాణ సాగునీటి ప్రయోజనాలు హరించబడతాయని తెలిపారు. విభజన చట్టం ప్రకారం గోదావరి-కృష్ణా బోర్డుల అనుమతులు తప్పనిసరిగా ఉన్నా, (AP Government) ఏపీ ప్రభుత్వం అనుమతులు లేకుండా (projects) ప్రాజెక్టు చేపట్టడం చట్ట ఉల్లంఘన అని ఆరోపించారు. (Cm chandrababu) సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టుకు నిధుల కోసం (Nirmala Sitharaman) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కి రెండు లేఖలు రాయడం పట్ల ఆందోళన కలిగిస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసే ప్రణాళికల అనుమతులు ఇంకా పెండింగ్‌లో ఉండడం శోచనీయమని వ్యాఖ్యానించారు.

సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు టీఏసీ అనుమతి రావడానికి కేంద్రం 6 నెలలుగా జాప్యం చేస్తోందన్నారు. సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్ ఎన్ఓసీ జారీపై కేంద్రం జోక్యం అవసరమన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులపై కేంద్రం దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం పంపిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలను కేంద్రం పరిగణనలోకి తీసుకోవడం లేనిదని ఆరోపించారు. మిషన్ కాకతీయ, చెరువుల పునరుద్ధరణ, చెక్ డ్యామ్‌ల ద్వారా సాగునీటి అవకాశాలు గణనీయంగా మెరుగుపడ్డాయన్నారు. వరద జలాల వినియోగం కోసం కాళేశ్వరం ప్రాజెక్టుకు అదనపు 1 టీఎంసీ నీరు ఎత్తిపోసే ప్రణాళికకు అనుమతులు ఇంకా లభించలేదని తెలిపారు. గోదావరి నదీ జలాల్లో (Telangana) తెలంగాణకు కేటాయించిన నీటి వాటాలను కాపాడేందుకు కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రయోజనాల రక్షణ కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తక్షణ చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడే చర్యలు చేపట్టడంలో కేంద్రం పూర్తి స్థాయి సహకారం అందించాలని లేఖలో పేర్కొన్నారు.

Next Story

Most Viewed