TGPSC : రేపు గ్రూప్ 1 ప్రొవిజనల్ మార్కుల జాబితా విడుదల

by M.Rajitha |
TGPSC : రేపు గ్రూప్ 1 ప్రొవిజనల్ మార్కుల జాబితా విడుదల
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana)లో 563 గ్రూప్-1(Group-1) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల్లో అభ్యర్థులు పొందిన అభ్యర్థులు సాధించిన ప్రొవిజినల్ మార్కుల వివరాలను టీజీపీఎస్సీ(TGPSC) సోమవారం ప్రకటించనుంది. గ్రూప్ -1 పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రధాన పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ముగియగా.. అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా వెల్లడికి అంతా సిద్ధం చేసింది. ముందుగా అభ్యర్థుల మార్కులను వెల్లడించి, ఆ తరువాత అభ్యంతరాలున్న వారి నుంచి రీకౌంటింగ్‌కు దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఆ ప్రక్రియ ముగిసిన తర్వాత 1:2 నిష్పత్తిలో జాబితాను కమిషన్ వెల్లడించనుంది. కాగా, అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరిగిన గ్రూప్- 1 ప్రధాన పరీక్షలకు 21,093 మంది అభ్యర్థులు హాజరుకాగా, ఒక్కో పోస్టుకు దాదాపు 38 మంది పోటీపడుతున్నారు.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో జరిగిన మొదటి గ్రూప్ -1 పరీక్షల ఫలితాలు కావడంతో అధికారులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం 2022లోనే 503 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేయగా, పరీక్షల నిర్వహణలో అక్రమాలు, పేపర్ లీకేజీల కారణంగా గ్రూప్- 1 ప్రిలిమ్స్ రెండుసార్లు రద్ధయింది. అనంతరం ఆ నోటిఫికేషన్‌కు మరో 60 పోస్టులు పెంచి 563 పోస్టులతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. గత ఏడాది జూన్ 9న ప్రిలిమ్స్, అక్టోబర్ 21 నుంచి ప్రధాన పరీక్షలు జరిగాయి. వీటికి సంబంధించిన ప్రొవిజినల్ మార్కుల జాబితాను రేపు టీజీపీఎస్సీ ప్రకటించనున్నది.

Next Story

Most Viewed