- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
MLC Kavitha : గ్రూప్-1 అనుమానాలు నివృత్తి చేయాలి : ఎమ్మెల్సీ కవిత

దిశ, వెబ్ డెస్క్ : గ్రూప్-1(Group-1) అభ్యర్థుల అనుమానాలకు టీజీపీఎస్సీ(TGPSC) సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల(MLC Kalvakuntla Kavitha) కవిత డిమాండ్ చేశారు. గ్రూప్-1 పరీక్షలు, వాటి ఫలితాలపై అభ్యర్థులు లేవనెత్తుతున్న అనుమానాలను ప్రభుత్వంతో పాటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నివృత్తి చేయాలని అన్నారు. గ్రూప్-1, 2, 3 పరీక్షల్లో(Group Exams) అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల విద్యార్థులు ప్రతినిధులు ఆదివారం ఎమ్మెల్సీ కవితను కలిసి చర్చించారు. తాము వ్యక్తపరుస్తున్న అనుమానాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, శాసనమండలిలో ఈ అంశాన్ని లేవనిత్తాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. పేపర్ల మూల్యాంకనంలో తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందని విద్యార్థులు తన దృష్టికి తీసుకు వచ్చారని తెలిపారు.
ట్రాన్స్లేషన్ సమస్య వల్ల ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు సరిగ్గా మూల్యాంకనం చేయలేకపోయారని, తద్వారా మార్కుల్లో వ్యత్యాసాలు ఏర్పడ్డాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. గ్రూప్ 1 పరీక్షల్లో ప్రిలిమ్స్ కి ఒక హాల్ టికెట్ నంబరు, మెయిన్స్ కి మరొక హాల్ టికెట్ నంబరు కేటాయించడం వల్ల విద్యార్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని ప్రస్తావించారు. అదే విధంగా, ఇటీవల పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన గ్రూప్ 2 ఫలితాల్లో దాదాపు 13 వేల మంది అభ్యర్థుల ఫలితాలు వెల్లడించలేదని, ఏ కారణం చేత ఆ 13 వేల మందిని ఇన్వ్యాలిడ్గా ప్రకటించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలు విద్యార్థి సంఘాల నాయకులు, పలువురు విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.