ములుగులో నకిలీ కరెన్సీ నోట్ల కలకలం

by M.Rajitha |
ములుగులో నకిలీ కరెన్సీ నోట్ల కలకలం
X

దిశ, వెబ్ డెస్క్ : ములుగు జిల్లా కేంద్రంలో నకిలీ కరెన్సీ నోట్లు కలకలం సృష్టిస్తున్నాయి. సోమవారం ఉదయం డిపాజిట్ చేయడానికి జిల్లా కేంద్రంలోని గ్రోమోర్ షాపు గుమాస్తా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుకు రూ.3 లక్షల 50 వేలు తీసుకు వచ్చాడు. వాటిలో కొన్ని నోట్లు నకిలీ కరెన్సీ అని బ్యాంకు అధికారులు గుర్తించారు. అధికారులు ఈ విషయన్ని పోలీసులకు సమాచారం ఇవ్వగా.. గుమస్తాను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. అవి షాపులో విత్తనాలు, ఎరువులు అమ్మగా వచ్చిన డబ్బులే అని తేలడంతో పోలీసులు అతన్ని విడిచిపెట్టారు. ఈ విషయం మీద స్థానిక మీడియా గ్రోమోర్ షాపు యాజమానిని, గుమస్తాను విచారించగా.. తమకే పాపం తెలియదని, అవి తమ షాపులో ఎవరో ఇచ్చారని ఆవేదన చెందారు. కాగా జిల్లా కేంద్రంలో నకిలీ కరెన్సీ వెలుగులోకి రావడంతో వ్యాపారులు, స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే జిల్లా కేంద్రంలో నకిలీ కరెన్సీ నోట్లు తయారు చేస్తున్నారా లేక చేతులు మారుతూ అవి ఇక్కడికి చేరాయా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed