రిపోర్టర్ పై 10 కోట్ల పరువు నష్టం దావా వేసిన మాజీ మంత్రి

by Disha Web Desk 12 |
రిపోర్టర్ పై 10 కోట్ల పరువు నష్టం దావా వేసిన మాజీ మంత్రి
X

దిశ, వెబ్‌డెస్క్: డీప్ ఫేక్ వీడియో తో తన పరువుకు నష్టం కలిగించారని ఓ చానల్ రిపోర్టర్ పై మాజీ మంత్రి పువ్వాడ అజర్ కుమార్ పరువు నష్టం దావా వేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఖమ్మం బీఆర్ఎస్ మాజీ మంత్రి.. తన సొంత పార్టీ నేతలపై బూతులతో విరుచుకు పడ్డారనే ఫేక్ ఆడియోను ఖమ్మం జిల్లా రిపోర్టర్ మందుల ఉపేందర్ తమ న్యూస్ ఛానల్ కు పంపారు. దీంతో ఆ డీప్ ఫేక్ ఆడియోను.. చానల్ ప్రసారం చేసింది. దీంతో సమాజంలో డీప్ ఫేక్ ఆడియోతో తన గౌరవానికి, పరువుకు నష్టం వాటిల్లేలా చేశారని.. పరువు నష్టం కింద రూ.10 కోట్ల ఇవ్వాలని అమ్మా న్యూస్ ఛానల్ యాజమాన్యానికి, రిపోర్టర్ ఉపేందర్ కు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నోటీసును పంపిటన్లు తెలుస్తుంది. కాగా ఈ వ్యవహారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Next Story

Most Viewed