రేపటి కేసీఆర్ యాత్రకు సర్వం సిద్ధం.. బస్సుకు ప్రత్యేక పూజలు

by Disha Web Desk 12 |
రేపటి కేసీఆర్ యాత్రకు సర్వం సిద్ధం.. బస్సుకు ప్రత్యేక పూజలు
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగనున్నారు. ఈ క్రమంలోనే రేపటి నుంచి నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ నుంచి బస్సు యాత్ర చేయనున్నారు. కేసీఆర్ యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్, ప్రణాళికలు అన్ని సిద్ధం చేశారు. దీంతో రేపటి నుంచి ప్రారంభం కానున్న ఈ యాత్రకు సంబంధించిన బస్సు(తెలంగాణ ప్రగతి రథం)కు ఈ రోజు తెలంగాణ భవన్ లో ప్రత్యేక పూజలు చేయించారు. ఏప్రిల్ 24 నుంచి 17 రోజుల పాటు ఈ బస్సు యాత్ర కొనసాగనుండగా.. మిర్యాలగూడలో ఈ యాత్ర ప్రారంభం మై మే 10న సిద్దిపేటలో బహిరంగ సభతో యాత్ర ముగియనుంది. కాతా పార్లమెంట్ ఎన్నికల్లో గతంలో తాము గెలిచిన స్థానాలతో పాటు మరిన్ని సీట్లలో విజయం సాధించడమే లక్ష్యంగా చేసుకుని కేసీఆర్ దాదాపు ప్రతి పార్లమెంట్ పరిధిలోని రెండు, అంతకంటే ఎక్కువ నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహించనున్నారు.



Next Story

Most Viewed