డీఎస్సీ ఫలితాలు వెంటనే విడుదల చేయాలి : బీఈడీ, డీఈడీ అభ్యర్థుల సంఘం డిమాండ్

by M.Rajitha |
డీఎస్సీ ఫలితాలు వెంటనే విడుదల చేయాలి : బీఈడీ, డీఈడీ అభ్యర్థుల సంఘం డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం 11,062 టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ ఫలితాలపై కాలయాపన చేయొద్దని, త్వరగా విడుదల చేయాలని బీఈడీ, డీఈడీ అభ్యర్థుల సంఘం నాయకులు శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా కొన్ని సెషన్స్ లో ఫైనల్ కీలో వచ్చిన తప్పులను సరిచేసి వెంటనే జనరల్ ర్యాంకింగ్ జాబితా కూడా విడుదల చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రిజల్ట్స్ త్వరగా రిలీజ్ చేసి నియామక ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed